రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు: లోకేష్‌

ABN , First Publish Date - 2022-03-17T21:37:41+05:30 IST

రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదని నారా లోకేష్‌ తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే రాష్ట్రం..

రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు: లోకేష్‌

అమరావతి: రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదని నారా లోకేష్‌ తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని తమ విధానమని ప్రకటించారు. నవ్వుతూ అసత్యాలు చెప్పడం జగన్‌కు అలవాటైందని విమర్శించారు. రాష్ట్రపతి, ప్రధానులకే అబద్ధాలు చెప్పగలిగే ఘనుడు జగన్ అని దుయ్యబట్టారు. పెగాసెస్ తాము కొనుగోలు చేసుంటే జగన్ అధికారంలోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ముందుచూపు వల్లే సీఆర్డీఏ చట్టం గెలిచిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఘటనపై రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతూనే ఉంటామని లోకేష్‌ ప్రకటించారు.

Updated Date - 2022-03-17T21:37:41+05:30 IST