సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-06-26T04:43:43+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫల మైందని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాష్ట్ర కార్య దర్శి ముఖరం చాంద్‌, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విమర్శించారు.

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
జనసేన క్రియాశీలక కిట్లను పంపిణీ చేస్తున్న నేతలు

వీరబల్లి, జూన్‌ 25: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫల మైందని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాష్ట్ర కార్య దర్శి ముఖరం చాంద్‌, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర విమర్శించారు. శనివారం సానిపాయి పంచాయతీ వంటిళ్లు వద్ద  నేతి వెంక టేష్‌ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ  చేశారు. రాజంపేట డివిజన్‌లో 179 మందికి జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు.  అనంత రం వార్డు మెంబరు వెంకటేష్‌ను సన్మానించారు వీర మహిళ రెడ్డిరాణి, ఓబులేసు, రామశ్రీను, వీరయ్యఆచారి, నేతి నాగార్జున, గుగి ్గళ్ల వెంకట్రామయ్య, పోకల సిద్దనాగయ్య, వంటా సుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:43:43+05:30 IST