పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం భరోసా

ABN , First Publish Date - 2022-06-26T05:54:14+05:30 IST

పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం భరోసా

పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం భరోసా
లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

కేశంపేట, జూన్‌ 25: కుల, మతలకు అతీతంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. కేశంపేట మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు ఇటీవల మంజూరైన కల్యాణ, షాదీ ముబారక్‌ చెక్కులను శనివారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ గణేష్‌, ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌, జడ్పీటీసీ విశాల శ్రావణ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ అనురాధ, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌, జగదీశ్వర్‌గౌడ్‌, రాంబల్‌నాయక్‌, నారాయణరెడ్డి  పాల్గొన్నారు.

దైవభక్తితోనే శాంతి 

యాచారం, జూన్‌ 25: దైవభక్తితోనే శాంతినెలకొంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.  మండల పరిధిలోని నందివనపర్తిలో శనివారం శ్రీ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ఆయన వెంట కొత్తూర్‌ తహసీల్దార్‌ రాములు, గ్రామస్థులు ఉన్నారు. 

Updated Date - 2022-06-26T05:54:14+05:30 IST