అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-10-01T06:11:22+05:30 IST

డుగు, బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
మంత్రి సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సైదులు, శ్రీరాములుగౌడ్‌

 మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

మర్రిగూడ, సెప్టెంబరు 30: బడుగు, బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని సరంపేట ఉపసర్పంచ్‌ జిల్లాకుల సైదులు, బీజేపీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు గౌడ్‌తో పాటు వట్టిపల్లి, సరంపేట గ్రామాల నుం చి పలువురు హైదరాబాద్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎ్‌స లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి యువతతో పాటు పెద్దలు ఆకర్షితులై టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారన్నారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. ఓటర్లను కాంగ్రెస్‌, బీజేపీ డబ్బుతో ప్రలోభపెట్టినా మునుగోడు ప్రజలు లొంగరన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, గంట కృష్ణ, మార్కెట్‌ చైర్మన్‌ దంటు జగదీశ్వర్‌, పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

సొంతగూటికి గట్టుప్పల ఎంపీటీసీ

చండూరు రూరల్‌: చండూరు మండలం గట్టుప్పల ఎంపీటీసీ-2 చెరుపల్లి భాస్కర్‌ సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో శుక్రవారం తిరిగి చేరారు. ఆయన ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరగా, తిరిగి సొంతగూటికి వచ్చారు. కార్యక్రమంలో గట్టుప్పల ఇన్‌చార్జి గోపగాని వెంకటనారాయణగౌడ్‌, బండారు చంద్రయ్య, మహే్‌షగౌడ్‌, అవ్వారి శ్రీనివాస్‌, గోపాల్‌, వెంకటేష్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T06:11:22+05:30 IST