కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-30T23:37:45+05:30 IST

కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు

కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: చంద్రబాబు

చిత్తూరు: కుప్పంకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. సామగుట్టపల్లిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హంద్రీనీవా పూర్తి చేయడం లేదన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజాసంపద దోచుకోవడమే తప్ప..ప్రజలపై ప్రేమ లేదని తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-10-30T23:37:45+05:30 IST