ప్రభుత్వ భూమి కబ్జాయత్నం
ABN , First Publish Date - 2021-06-23T06:03:56+05:30 IST
ఏర్పేడు మండలం వికృతమాలలో ప్రభుత్వ భూమిని వైసీపీ నేత కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు.
ఏర్పేడు, జూన్ 22: మండలంలోని వికృతమాల పంచాయతీలో ప్రభుత్వ భూమిని ఓ వైసీపీ నేత కబ్జాచేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. వివరాలివీ.. ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ పరిధిలో సర్వే నెం:98లో ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. గతనెల 28న స్థానిక వైసీపీ నాయకుడు ఈ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ ఆయన ఇదే భూమిని చదును చేసేయత్నం చేయగా, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఇకపై కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లారు.