గుర్తించండి... సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-05-15T04:52:58+05:30 IST
ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న నిర్వహిస్తున్న సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
గజపతినగరం మే14: ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న నిర్వహిస్తున్న సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని సేల్స్మెన్, సూపర్వైజర్లు గజపతినగరంలో మద్యం షాపు ఎదుట నిరసన చేపట్టారు. తమకు వ్యాక్సిన్ వేయాలని, శానిటైజర్లు, మాస్కులు, అందించి, బీమా సౌకర్యం కల్పించా లని కోరారు. 18 నెలులగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ను తమ ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఈ నిరసనలో గణేష్, బాను, అప్పలనాయుడు తదితరుల పాల్గొన్నారు.