అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రసమయి

ABN , First Publish Date - 2022-06-26T05:04:33+05:30 IST

గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని విస్మరించినా కోట్ల రూపాయల నిధులతో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రసమయి
బేగంపేటలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

బెజ్జంకి, జూన్‌ 25: గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని విస్మరించినా కోట్ల రూపాయల నిధులతో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. శనివారం మండలంలోని వడ్లూరు, బేగంపేట గ్రామాల్లో రూ.కోటి యాబై లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బేగంపేటలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అనంతరం గుండారం గ్రామంలో పాల కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. కాగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచులు అనిత, సంజీవరెడ్డి, లావణ్య, రాజశ్రీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, ఎంపీడీవో రాము, ఎంపీటీసీ లత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, శ్రీనివా్‌సగుప్తా, పాపయ్య, శేఖర్‌బాబు, బోనగిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2022-06-26T05:04:33+05:30 IST