ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం రోజే ప్రజలపై ప్రభుత్వం బాదుడు

ABN , First Publish Date - 2022-04-04T22:18:46+05:30 IST

ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం రోజే ప్రజలపై ప్రభుత్వం బాదుడు మొదలు పెట్టింది. జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది.

ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం రోజే ప్రజలపై ప్రభుత్వం బాదుడు

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం రోజే ప్రజలపై ప్రభుత్వం బాదుడు మొదలు పెట్టింది. జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచింది. మార్కెట్‌ విలువ పెంచేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుమతిచ్చింది. జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువను పెంచుతూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల కేంద్రాల్లో మార్కెట్‌ విలువ పెంచారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రస్తుత విలువ ఆధారంగా 20 నుంచి 50 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లా కేంద్రం వచ్చిందని సంబరపడేలోపే ప్రజలపై ప్రభుత్వం బాదుడు మొదలు పెట్టింది.

Updated Date - 2022-04-04T22:18:46+05:30 IST