‘ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం’
ABN , First Publish Date - 2021-02-28T04:14:47+05:30 IST
రాబోయే రోజుల్లో మరో 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంద ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
కొల్లాపూర్, ఫిబ్రవరి 27: రాబోయే రోజుల్లో మరో 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంద ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం టీ ఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఎన్.గార్డెన్లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రు ల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే హా జరై మా ట్లాడారు. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ప ట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బల ప ర్చిన టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను మునిసిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి సన్మానించారు. అనంతరం రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త అన్నాలదాసి ఈశ్వర య్య కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ మహెము దాబేగం, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు కృషి చేయాలి
అచ్చంపేట: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయా లని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. శనివా రం పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మె ల్సీ ఎన్నిక సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లా డారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్య క్షుడు మనోహర్, మునిసిపల్ చైర్మన్ తులసీరాం, జడ్పీటీసీలు మంత్రి య, రాంబాబు, నాయకులు, రాజేందర్, రాజేశ్వర్రెడ్డి, కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.