ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకం

ABN , First Publish Date - 2022-01-29T05:19:01+05:30 IST

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబా నికి ప్రభుత్వ పథకాలలో ఏదో ఒకటి అందుతోందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ పథకం
జడ్చర్లలో సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీని అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి 

- బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ 

-  పార్టీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

జడ్చర్ల, జనవరి 28 : రాష్ట్రంలోని ప్రతీ కుటుంబా నికి ప్రభుత్వ పథకాలలో ఏదో ఒకటి అందుతోందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల లోని చంద్రాగార్డెన్స్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి,  రైతుబీమా, పార్టీ ఇన్సూరెన్స్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడా రు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో లేని పథకాలను రా ష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నార న్నారు. జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి 57మందికి మంజూరు అ యిన  రూ.63లక్షల విలువగల ఎల్‌వోసీలను పంపిణీ చేశారు. అలాగే రైతుబీమాకు సంబంధించి ఎనిమిది మంది రైతుకుటుంబాలకు రూ.40లక్షల విలువగల చెక్కులను అందచేశారు. అలాగే  పార్టీ సభ్యత్వం కలి గి ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు కార్యకర్తల కుటుంబాలకు  రూ.12లక్షల విలువగల చెక్కులను అందజేశారు. 

Updated Date - 2022-01-29T05:19:01+05:30 IST