ప్రజా సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు
ABN , First Publish Date - 2021-04-22T05:29:42+05:30 IST
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో టీఆర్ఎస్లో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆదిలాబాద్రూరల్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని పొచ్చెర గ్రామంలో టీఆర్ఎస్లో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామా నికి చెందిన అల్లూరి రమేష్రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పలువురు యువకులకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, మండల అధ్యక్షుడు సేవలక్ష్మి జగదీశ్, టీఆర్ఎస్ నాయకులు కొండ లక్ష్మణ్, ఎల్లకొండ గంగాధర్, మాజీ సర్పంచ్ ఆశన్న, కిష్టారెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అల్లికోరి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ గంగారాంపటేల్, మహిళలు, 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందరు చేరారని, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమన్నారు.