ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఇంటికీ చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తనయుడు, టీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి తెలిపారు. ఎదులాబాద్లో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, కానీ ప్ర జలకు వివరించడంలో మనం వెనుకపడుతున్నామని గుర్తుచేశారు. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. చురుగ్గా పనిచేసే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివా్సగౌడ్, సర్పంచ్ సురేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ప్రవీణ్రెడ్డి, శంకర్, నాగరాజు, భిక్షపతిగౌడ్, రవి, కుమార్, ధర్మారెడ్డి, ఉప్పు లింగేశ్వర్రావు, చిరంజీవి, శ్రీనివాస్, బాల్రాజ్, ఆశి్షరెడ్డి, సంతో్షగౌడ్, అరవింద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.