ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-11-28T05:03:52+05:30 IST

ప్రభుత్వ పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా అవగా హన కల్పించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి స్థా నిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించా లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి ఆదే శించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

- జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి


వనపర్తి రూరల్‌, నవంబరు 27: ప్రభుత్వ పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా అవగా హన కల్పించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి స్థా నిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించా లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి ఆదే శించారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాల యంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. సమావేశంలో చైర్మన్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. అదేవిధంగా, జిల్లా అభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించాలని సూచిం చారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు. తదు పరి జిల్లా పరిషత్‌ సమావేశ తేదీని త్వరలో తెలియ జేస్తామని పేర్కొంటూ సమావేశాన్ని ముగించా రు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, పరి షత్‌  సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-28T05:03:52+05:30 IST