ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు: సురేష్
ABN , First Publish Date - 2022-04-15T23:44:59+05:30 IST
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వెళ్లగొట్టినా టీడీపీ నేతలకు సిగ్గులేదన్నారు. జగనన్న అమ్మఒడిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమ్మఒడికి కొత్తగా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపారు. ఏపీకి జగన్ శాశ్వత సీఎం అనే ఆలోచనలో ప్రజలున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.