కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ABN , First Publish Date - 2022-07-07T05:50:53+05:30 IST
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్ర భు త్వ పాఠశాలలను బ లోపేతం చేసేందు కు ప్రభుత్వం కృషి చే స్తుందని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు.
కట్టంగూరు, నల్లగొండ, జూలై 6: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్ర భు త్వ పాఠశాలలను బ లోపేతం చేసేందు కు ప్రభుత్వం కృషి చే స్తుందని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. మండలంలోని గార్ల బావిగూడెం గ్రామంలో రూ.25 లక్షల అభివృద్ధి పనులకు, చెర్వుఅన్నారం గ్రా మంలో రూ.70లక్షలతో చేపట్టనున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సీసీరోడ్ల ప నులకు బుధవారం ఆ యన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అనంతరం కట్టంగూరులోని పీఆర్ఆర్ ఫంక్షనహాల్లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నకిరేకల్లో త్వరలో నిర్మించనున్న 100 ప డకల ఆస్పత్రి స్థలాన్ని ఎమ్మెల్యే లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.32 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్మన రాచకొండ శ్రీనివా్సగౌడ్, జడ్పీటీసీ తరాల బలరాం, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన పోగుల నర్సింహ, పీఏసీఎస్ చైర్మన నూక సైదులు, వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, నాయకులు ఏడుకొండలు, శిరీషయాదగిరి, నర్సిరెడ్డి, హరికృష్ణ, ప్రసాద్ శ్రీను, రాములు, లింగారెడ్డి, సైదులు పాల్గొన్నారు.