బాలినేని అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి: బాలవీరాంజనేయస్వామి
ABN , First Publish Date - 2022-04-09T21:55:30+05:30 IST
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపై ఆరోపణలు చేస్తే.. ఇప్పటి వరకూ స్పందించలేదని తెలుగుదేశం ఎమ్మెల్యే..
ప్రకాశం: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపై ఆరోపణలు చేస్తే.. ఇప్పటి వరకూ స్పందించలేదని తెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బాలినేని అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేతల రౌడీయిజానికి భయపడమన్నారు. వైసీపీ అరాచకాలను తిప్పి కొడతామని వీరాంజనేయస్వామి హెచ్చరించారు.