రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-23T21:14:58+05:30 IST

రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్షకులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి: చంద్రబాబు

అమరావతి: రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్షకులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని, కనీస మద్దతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంతో ఉన్నారని తెలిపారు. వరి వేయవద్దని చెప్పడం రైతులను అవమానించడమేనని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2021-12-23T21:14:58+05:30 IST