విద్యార్థినిని బెదిరించి శారీరక సంబంధం.. తల్లి నిలదీసిందని టీసీ ఇచ్చేస్తానని హెచ్చరిక.. విషయం గ్రామస్తులకు తెలియడంతో..

ABN , First Publish Date - 2022-09-19T01:20:17+05:30 IST

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టాల్సిన గురువు దారి తప్పాడు..

విద్యార్థినిని బెదిరించి శారీరక సంబంధం.. తల్లి నిలదీసిందని టీసీ ఇచ్చేస్తానని హెచ్చరిక.. విషయం గ్రామస్తులకు తెలియడంతో..

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టాల్సిన గురువు దారి తప్పాడు.. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిని బెదిరించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. విషయం తెలుసుకున్న తల్లి అతడిని నిలిదీయడంతో బాలిక టీసీ ఇచ్చేస్తానని బెదిరించాడు.. గ్రామస్తులందరూ పాఠశాల ఎదుట నిరసనకు వస్తున్నారని తెలిసి పరారయ్యాడు.. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని ఝంఝునులో ఈ ఘటన వెలుగు చూసింది. 


ఇది కూడా చదవండి..

Shocking: భార్య ప్రవర్తనతో విసిగిపోయి మామగారి ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ తర్వాత..


ఝుంఝునులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై కన్నేశాడు. ఆమెను బెదిరించి, భయపెట్టి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గత ఆరు నెలలుగా ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి తల్లికి చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి పాఠశాలకు వెళ్లి నిందితుడిని నిలదీసింది. దీంతో అతను బాలిక తల్లిని బెదిరించాడు. బాలిక టీసీ ఇచ్చి పాఠశాల నుంచి పంపించేస్తానని హెచ్చరించాడు. 


దీంతో బాధితురాలి తల్లి గ్రామ పంచాయితీ పెద్దలను ఆశ్రయించింది. వారంతా బాధితురాలికి అండగా నిలిచారు. స్కూలు ఎదుట నిరసనకు దిగారు. ముందే విషయం తెలుసుకున్న నిందితుడు పాఠశాలకు సెలవు పెట్టేసి పరారయ్యాడు. దీంతో విద్యా శాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-09-19T01:20:17+05:30 IST