రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
ABN , First Publish Date - 2022-01-20T07:06:53+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన ముదిరెడ్డి అనంతరెడ్డి(48) సూర్యాపేటలోని మన్నెం టౌన్షిప్లో నివసిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నూతనకల్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేటరూరల్, జనవరి 19: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన ముదిరెడ్డి అనంతరెడ్డి(48) సూర్యాపేటలోని మన్నెం టౌన్షిప్లో నివసిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నూతనకల్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి బైక్పై ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా పట్టణంలోని జనగాంక్రాస్ రోడ్డులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.