18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్.. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్స్!
ABN , First Publish Date - 2021-04-22T18:38:19+05:30 IST
దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమవుతోంది.
దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమవుతోంది. 18 ఏళ్లు దాటిన వారిందరికీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించబోతున్నట్టు కేంద్రం తాజాగా తెలిపింది.
అర్హులైన వారందరూ cowin.gov.in. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విదేశీ టీకాలకు కూడా అనుమతులిచ్చేందుకు ముందుకు వచ్చింది.