ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తాం : పినరయ్ విజయన్
ABN , First Publish Date - 2021-04-22T02:01:41+05:30 IST
వ్యాక్సినేషన్పై కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి
తిరువనంతపురం : వ్యాక్సినేషన్పై కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రకటించారు. కోవిడ్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని పినరయ్ ప్రకటించారు. బుధవారానికి కొత్తగా 22,141 కోవిడ్ కేసులు వచ్చాయని, 22 మంది కరోనా బారిన పడి మృతి చెందారని ప్రకటించారు. అయితే తాము రాష్ట్రంలో లాక్డౌన్ విధించమని, ప్రజలే కోవిడ్ నిబంధనలను పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని పినరయ్ విజయన్ పేర్కొన్నారు.