రైతు బీమా చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్
ABN , First Publish Date - 2020-10-23T11:37:37+05:30 IST
కామారెడ్డి మండలం కోటాల్పల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల నాగభూషణం ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయనకు రైతు బీమా రూ.5లక్షలు మంజూరయ్యాయి.
కామారెడ్డి, అక్టోబరు 22: కామారెడ్డి మండలం కోటాల్పల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల నాగభూషణం ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయనకు రైతు బీమా రూ.5లక్షలు మంజూరయ్యాయి. మంజూరైన డబ్బులను గురువారం కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మృతిడి కుటుంబ సభ్యుల కు చెక్కులను అందించారు. అంతేకాకుండా రాత్రి కామారెడ్డి హౌజింగ్బోర్డు కాలనీ లోని శారదమాత ఆలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్రావు, కౌన్సిలర్ కృష్ణమోహన్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు గెరిగంటి లక్ష్మీనారాయణ, మాసుల లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్రెడ్డిలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు గంగావరపు ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రభుత్వవిప్, మున్సిపల్ చైర్పర్సన్లను సన్మానించారు.