గవర్నర్ తమిళిసై కు గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డు

ABN , First Publish Date - 2021-03-04T22:25:02+05:30 IST

తెలంగాణ గవర్నర్, పుదుచ్ఛెరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్

గవర్నర్ తమిళిసై కు గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డు

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్, పుదుచ్ఛెరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్  ప్రతిష్టాత్మక  టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు.యుఎస్ లోని కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందజేసే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు. గవర్నర్తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైనారు.


ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ప్రధానం చేస్తారు. సమాజ హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్కి ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 

Updated Date - 2021-03-04T22:25:02+05:30 IST