పీఆర్సీపై కాలయాపన తగదు
ABN , First Publish Date - 2021-04-23T05:26:52+05:30 IST
ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేయడం తగదని యూటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు జి.చిన్నబ్బాయ్ అన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిన్నబ్బాయ్
చోడవరం, ఏప్రిల్ 22: ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేయడం తగదని యూటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు జి.చిన్నబ్బాయ్ అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ప్రభుత్వం తాత్సారం చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను వేదనకు గురిచేస్తున్నదన్నారు. 55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.