మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-08-18T05:48:29+05:30 IST

సెస్టెంబర్‌ 1న విజయవాడలో నిర్వహించే సీపీఎస్‌ ఉద్యోగుల మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌ బాషా పిలుపు నిచ్చారు.

మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయండి
గోడప్రతులను ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు

గుంటూరు(తూర్పు), ఆగస్టు 17: సెస్టెంబర్‌ 1న విజయవాడలో నిర్వహించే సీపీఎస్‌ ఉద్యోగుల మిలియన్‌ మార్చ్‌ను జయప్రదం చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌ బాషా పిలుపు నిచ్చారు. ఈమేరకు బుధవారం సంఘ కార్యాలయంలో మిలియన్‌ మార్చ్‌ వాల్‌పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం చాంద్‌ బాషా మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సెస్టెంబర్‌ 1న మిలియన్‌ మార్చ్‌, సభను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మయ్య, సంయుక్త కార్యదర్శి విల్సన్‌, శ్రీనివాసరావు, సీపీఎస్‌ ఉద్యోగ సంఘ నాయకులు ఉమేద్‌బేగ్‌, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, పి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T05:48:29+05:30 IST