కరోనా వ్యాక్సిన్ పంపిణీ వివరాలను వెల్లడించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-05-07T23:38:12+05:30 IST

కరోనా వ్యాక్సిన్ పంపిణీ వివరాలను వెల్లడించిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ పంపిణీ వివరాలను వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ వయస్సు వారీగా పంపిణీ చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన పౌరులకు 41 శాతం కోవిడ్-19 టీకా వేసినట్లు పేర్కొంది. 45-60 సంవత్సరాల వయస్సు గలవారు 46 శాతం ఉన్నారని తెలిపింది. 30-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 9శాతం, 18-30 సంవత్సరాల వయస్సు గలవారు 4శాతం వాటా కలిగి ఉన్నారని, మొత్తం 16.50 కోట్ల డోసులు ఇప్పటివరకు నిర్వహించబడింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో రోజువారీగా కోవిడ్ కేసులు లక్షల్లోనే నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-05-07T23:38:12+05:30 IST