మెరిసే రంగులతో గ్రాఫిటీ.. గ్రహాంతరవాసులు కళ్లముందే ఉన్నట్టు..

ABN , First Publish Date - 2022-03-16T23:52:18+05:30 IST

వంతెనలు, ఇళ్ల గోడలపై ప్రజలందరికీ కనిపించేలా వివిధ రంగుల్లో పెయింటిగ్స్ రూపొందించడమే గ్రాఫిటీ..! ఇలాంటివి ప్రభుత్వ స్థలాల్లో అధికంగా ఇటువంటివి దర్శనమిస్తుంటాయి. ప్రపంచం దృష్టి మరోమారు గ్రాఫిటీపై పడేలా చేసేందుకు వివిధ ఆర్టిస్టులు తాజాగా ముందుకొచ్చారు.

మెరిసే రంగులతో గ్రాఫిటీ.. గ్రహాంతరవాసులు కళ్లముందే ఉన్నట్టు..

ఇంటర్నెట్ డెస్క్: వంతెనలు, ఇళ్ల గోడలపై ప్రజలందరికీ కనిపించేలా వివిధ రంగుల్లో పెయింటింగ్స్ రూపొందించడమే గ్రాఫిటీ..! ప్రభుత్వ స్థలాల్లో ఇటువంటివి అధికంగా దర్శనమిస్తుంటాయి. న్యూయార్క్ నగరంలో 1970ల్లో మొదలైన దీనికి..  సామాన్యుడి జీవనపోరాటాలు, మనోభావాలను ప్రతిబింబించే ఆధునిక కళామాధ్యమంగా పేరుంది. వాస్తవానికి ఇలా గ్రాఫిటీకి పాల్పడ్డం తప్పని చెప్పే చట్టాలు కూడా రూపొందాయి. స్ట్రీట్ ఆర్ట్‌గా ముద్రపడ్డ ఈ కళ ప్రముఖ ఆర్ట్ వేదికల్లో అరదుగా మాత్రమే దర్శనమిస్తుంటుంది. అయితే.. ప్రపంచం దృష్టి మరోమారు గ్రాఫిటీపై పడేలా చేసేందుకు పలువురు గ్రాఫిటీ ఆర్టిస్టులు తాజాగా ముందుకొచ్చారు. దుబాయ్‌లోని రీథింగ్ ఆర్ట్ ఫెస్టివల్ వేదికగా వారు.. వెలుగులు విరజిమ్మే ఫ్లోరెసెంట్ పెయింట్లతో రూపొందించిన గ్రహాంతరవాసుల చిత్రాలను ప్రదర్శించారు. ఈ పెయింటింగ్స్ ప్రస్తుతం కళాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.







Updated Date - 2022-03-16T23:52:18+05:30 IST