తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-07-25T19:48:18+05:30 IST

తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

తక్షణమే ధాన్యం రైతులను ఆదుకోవాలి: దేవినేని ఉమ

కృష్ణా: తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలితే మట్టి కొట్టుకుపోతారని దేవినేని ఉమా జోస్యం చెప్పారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై దేవినేని ఉమా మండిపడ్డారు. దాళ్వా ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. జి కొండూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కవులూరులో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T19:48:18+05:30 IST