రైతులకు ధాన్యం డబ్బులు జమ చేయాలి

ABN , First Publish Date - 2022-06-25T05:21:28+05:30 IST

రైతులు ధాన్యం అమ్మి నెలరోజుల గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమకాలేదని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ తెలిపారు.

రైతులకు ధాన్యం డబ్బులు జమ చేయాలి
నంచర్ల గేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ 

మహమ్మదాబాద్‌, జూన్‌ 24 : రైతులు ధాన్యం అమ్మి నెలరోజుల గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమకాలేదని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని నంచర్ల గేట్‌ చౌర స్తాలో మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, రైతులు తాండూర్‌- మహబూబ్‌నగర్‌ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు 40 నిమిషాల పాటు రోడ్డుపై వా హనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా కేఎం నారాయణ మాట్లాడుతూ ధాన్యం డ బ్బులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చే యడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చే ఎన్ని కల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంట నే రెండు లక్షల లోపు రైతు రుణాన్ని మాఫీ చేస్తా మన్నారు. రైతులు ఎవ్వరు కూడా రుణాలు కట్ట వద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు జితేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పులిందర్‌రెడి,్డ నాయకులు బాలముకుందం,  ఆశన్న, వీరాజీ, లక్ష్మీకాంత్‌రెడ్డి, మధు, వెంకట్‌ రాములు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:21:28+05:30 IST