జూన్ 10 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-05-21T06:03:47+05:30 IST
జూన్ 1 నాటికల్లా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను సూచించారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి టౌన్, మే 20: జూన్ 1 నాటికల్లా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం తన కార్యాయలంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 19,394మంది రైతు ల వద్ద నుంచి లక్షా43వేల 783మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 10,493 మంది రైతులకు నూటయాబై కోట్ల 76లక్షల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నా రు. మే చివరి నాటికి 90 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తుందని, వాటిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్ర మంలో తోట వెంకటేష్, ప్రవీణ్, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.