ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-19T07:06:41+05:30 IST
వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.
సోన్, మే 18 : వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోన్ మండల కేంద్రంతో పాటు గంజాల్ గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరి శీలించారు. ఇప్పటి వరకు చేపట్టిన కొనుగోళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25 లోపు రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సూచించారు. గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, ఆర్ఐ సోహెల్, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.