KCR దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభస
ABN , First Publish Date - 2022-05-11T18:16:42+05:30 IST
జిల్లాలోని తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభసగా మారింది.
యాదాద్రి: జిల్లాలోని తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్(KCR) దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభసగా మారింది. గ్రామ పునర్నిర్మాణానికి గ్రామపంచాయితీ తీర్మానం కోసం కలెక్టర్(Collector) పమేలా సత్పతి సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జీపీ తీర్మానం ఆమోదిస్తున్నట్లు సర్పంచ్ ఎలా చెప్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పునర్నిర్మాణంపై గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల అనుమానాలపై క్లారిటీ ఇచ్చాకే జీపీ తీర్మానం చేయాలని ప్రజలు స్పష్టం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ... ఇప్పుడున్నట్లుగానే కమ్యూనిటీ వర్గాల వారీగా గ్రామ పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు. జీపీ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్ పమేలా మధ్యలోనే వెళ్లిపోయారు.