18 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-18T05:53:47+05:30 IST

ఎర్రగొండపాలెం మండలంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వ హించారు.

18 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు


84 మందిపై విద్యుత్‌ అక్రమ వినియోగంపై కేసులు  

రూ.1,18900 అపరాధ రుసుము విధింపు

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 17 : ఎర్రగొండపాలెం మండలంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వ హించారు. విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న  వారిపై కేసులు నమోదు చేశారు. 18 గ్రామాల్లో తనిఖీలు నిర్వహించామని ఏఈ టి.అల్లూరయ్య తెలిపారు. మార్కాపురం డివిజన్‌ ఆపరేషన్‌ ఈఈ ప్రసన్నకుమార్‌ పర్యవేక్షణలో 26 గ్రూపులుగా  ఏర్పడి 18 గ్రామాల్లో  దాడులు నిర్వహించామని చెప్పారు. 1987 విద్యుత్‌ సర్వీసు  కనెక్షన్లు  తనిఖీ చేశామని తెలిపారు. 84 మంది విద్యుత్‌ చౌర్యానికి పా ల్పడుతున్నట్లు గుర్తించామని అల్లూరయ్య తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి, లక్షా 18వేల రూపాయల పెనాలిటీ విధించామని తెలిపారు. ఈ తనిఖీల్లో డీపీఈ శ్రీనివాసరావు, సబ్‌డివిజన్‌ డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఒ అండ్‌ ఎం స్టాఫ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:53:47+05:30 IST