అద్దాల్లో నుంచే మనవడిని చూసుకుని మురిసిపోయారు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-11-27T08:48:18+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా జీవితాన్ని మార్చే మధుర

అద్దాల్లో నుంచే మనవడిని చూసుకుని మురిసిపోయారు.. అమెరికాలో..

కెంటుకీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా జీవితాన్ని మార్చే మధుర క్షణాలను కూడా ప్రజలు వినూత్నంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోని కెంటుకీకి చెందిన భార్యాభర్తలు అప్పుడే పుట్టిన తమ మనవడిని అద్దాల్లో నుంచి చూసుకోవడం వైరల్‌గా మారింది. తనకు పుట్టిన కొడుకును.. తన తల్లిదండ్రులకు అద్దాల్లో నుంచి చూపించడం పైనున్న ఫొటోలో గమనించవచ్చు. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇక ఇదే ఫొటోలో ఇద్దరు వృద్దులతో పాటు పెంపుడు కుక్క కూడా శిశువును ప్రత్యేకంగా చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు కుక్కకు కూడా ఇంట్లో స్థానం ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన విషయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2020-11-27T08:48:18+05:30 IST