అర్హులైన రైతులకు రుణాల మంజూరు
ABN , First Publish Date - 2021-10-17T04:49:40+05:30 IST
అర్హులైన రైతులకు రుణాల మంజూరు
కులకచర్ల: అర్హులైన రైతులకు రుణాలు మంజూరు చేస్తామని డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి తెలిపారు. కులకచర్ల హెచ్డీసీసీబీ ద్వారా మండలంలోని సాల్వీడ్ గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు ట్రాక్టర్ మంజూరుకాగా శనివారం డీసీసీబీ చైర్మన్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరిక్రిష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, కొండయ్యగౌడ్ పాల్గొన్నారు.