ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు మంజూరు చేయండి
ABN , First Publish Date - 2021-05-10T04:50:54+05:30 IST
జిల్లాకు వందేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లతో పాటు 30 వెంటిలేటర్లు మంజూరు చేయాలని కోరుతూ విదేశాంగమంత్రి జైశంకర్కు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు అదే లేఖను మీడియాకు ఎంపీ విడుదల చేశారు. ఇటీవల విదేశీ సహాయంగా మనదేశం అందుకున్న అత్యవసర వైద్యపరికరాలలో కొన్ని సిక్కోలుకు అందించాలని ఎంపీ కోరారు.
విదేశాంగ మంత్రి జైశంకర్కు ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 9 : జిల్లాకు వందేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లతో పాటు 30 వెంటిలేటర్లు మంజూరు చేయాలని కోరుతూ విదేశాంగమంత్రి జైశంకర్కు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు అదే లేఖను మీడియాకు ఎంపీ విడుదల చేశారు. ఇటీవల విదేశీ సహాయంగా మనదేశం అందుకున్న అత్యవసర వైద్యపరికరాలలో కొన్ని సిక్కోలుకు అందించాలని ఎంపీ కోరారు. కొవిడ్ సంబంధిత విదేశీ సాయం పంపిణీలో నెలకొన్న గందరగోళాన్ని, అడ్డంకులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వైద్యపరికరాలపై జీఎస్టీ భారాన్ని తొలగించాలని లేఖలో ప్రస్తావించారు. మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో వీలైనంత తక్కువ ధరలలో వైద్యపరికరాలు సమకూర్చాలని ఆయన కోరారు.