పెండింగ్‌లోని సబ్సిడీలు మంజూరు చేయండి

ABN , First Publish Date - 2020-10-20T06:20:16+05:30 IST

జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ ద్వారా పెం డింగ్‌లో ఉన్న పెట్టుబడి సబ్సిడీలను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు

పెండింగ్‌లోని సబ్సిడీలు మంజూరు చేయండి

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 19: జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ ద్వారా పెం డింగ్‌లో ఉన్న పెట్టుబడి సబ్సిడీలను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో 41వ టీఎస్‌ఐపాస్‌, జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పౌలి్ట్రఫామ్‌, నాలా కాన్వర్షన్‌లతో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని సబ్సిడీలను నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే మంజూరు చేయాలన్నారు. టీ ఫ్రైడ్‌ కింద ఎస్సీల కు పెండింగ్‌లో ఉన్న 14 రుణాలు, ఎస్టీలకు పెండింగ్‌లో ఉన్న 24 రుణాలు వెంటనే మంజూరు చేయాలన్నారు. సకాలంలో స్పందించని రెండు అప్లికేషన్‌లను రిజక్ట్‌ చేశా మని, సకాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలన్నా రు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబూరావు, గిరిజన సంక్షేమాధికారి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T06:20:16+05:30 IST