గురజాడకు ఘన నివాళులు

ABN , First Publish Date - 2021-12-01T06:19:38+05:30 IST

ప్రముఖ సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎస్‌.రాయవరంలో ఆయన విగ్రహానికి ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, గోవిందరావు దంపతులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

గురజాడకు ఘన నివాళులు
గురజాడ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపీపీ శారదాకుమారి

 ఎస్‌.రాయవరంలో విగ్రహానికి పూలమాలలు వేసిన ఎంపీపీ దంపతులు 


ఎస్‌.రాయవరం, నవంబరు 30: ప్రముఖ సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఎస్‌.రాయవరంలో ఆయన విగ్రహానికి ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, గోవిందరావు దంపతులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గురజాడ వంటి మహాపురుషుడు జన్మించిన ఎస్‌.రాయవరంలో తాము ఉండడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. గురజాడ కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ లక్కోజు ఆదిమూర్తి, సర్పంచ్‌ భూపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T06:19:38+05:30 IST