హోల్సేల్ మార్కెట్ను సందర్శించిన గ్రేటర్ కమిషనర్
ABN , First Publish Date - 2022-05-29T05:42:15+05:30 IST
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా 41వ వార్డులోని జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను శనివారం ఉదయం సందర్శించారు. గుడ్డసంచులు వాడాలని వ్యాపారులు, వినియోగదారులకు సూచించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడాలని వ్యాపారులు, వినియోగదారులకు సూచన
జూన్ 5 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని సూచన
విశాఖపట్నం, మే 28: జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా 41వ వార్డులోని జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను శనివారం ఉదయం సందర్శించారు. గుడ్డసంచులు వాడాలని వ్యాపారులు, వినియోగదారులకు సూచించారు. జూన్ ఐదు నుంచి ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తున్నామని, అధిగమించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్సీ మల్లయ్యనాయుడు, జీవీఎంసీ అధికారులు ఉన్నారు.