గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొలువు దీరిన కొత్త కార్యవర్గం

ABN , First Publish Date - 2021-05-07T23:47:26+05:30 IST

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా

గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొలువు దీరిన కొత్త కార్యవర్గం

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ఎన్నికయ్యారు. వీరిద్దరి ఎన్నికను ప్రత్యేక అధికారి సంధ్యారాణి ప్రకటించారు. మేయర్ స్థానానికి గుండు సుధారాణి పేరును ఇండ్ల నాగేశ్వర రావు ప్రతిపాదించగా, వస్కుల బాబు బలపరిచారు. డిప్యూటీ మేయర్ స్థానానికి రెజ్వినా షమీమ్ పేరును కార్పొరేటర్ సుంకరి మనీషా ప్రతిపాదించగా, మరో కార్పొరేటర్ రంజిత్ రావు బలపరిచారు. తదనంతరం వీరిద్దరిచే ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లతో కూడా ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.  దీంతో గ్రేటర్ వరంగల్‌లో కొత్త పాలక వర్గం కొలువుదీరినట్టైంది. ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకు గుండు సుధారాణి ధన్యవాదాలు ప్రకటించారు. బీసీ మహిళగా తనపై నమ్మకంతో మేయర్ పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు.  పార్టీ అధిష్ఠానం తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని, వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చి దిద్దుతామని గుండు సుధారాణి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-05-07T23:47:26+05:30 IST