Ganesh immersion: ముధోల్లో వినాయక నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2022-09-07T20:46:20+05:30 IST
ముధోల్లో వినాయక నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
నిర్మల్: ముధోల్లో వినాయక నిమజ్జనాని (Ganesh immersion)కి గ్రీన్ సిగ్నల్ లభించింది. నిమజ్జనానికి సంబంధించి హిందూ ఉత్సవ కమిటీతో పోలీసుల చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. శోభాయాత్రలో సౌండ్ బాక్స్ల సెట్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర చేసుకోవాలని పోలీసులు తెలిపారు. గణేష్ శోభాయాత్రలో డీజేలకు పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో నిన్నటి నుంచి ఉద్రిక్తత కొనసాగిన విషయం తెలిసిందే.