స్నేహితుల కుటుంబాలకు అండగా..
ABN , First Publish Date - 2021-10-18T04:37:50+05:30 IST
స్నేహితుల కుటుంబాలకు అండగా..
శామీర్పేట: ఒక మరో స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో, మరో స్నేహితుడు అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాలకు తోటి స్నేహితులు ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు. శామీర్పేట గ్రామానికి చెందిన క్రిష్ణాగౌడ్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాధిత కుటుంబానికి 1998-99 బ్యాచ్కు చెందిన శామీర్పేట, బాబాగూడ, బొమ్మరాశిపేట, పొన్నాల్, ఉప్పర్పల్లి గ్రామాలకు చెందిన పూర్వవిద్యార్థులు రూ.55 వేలు ఆర్థికసాయం అందజేశారు. దేవిధంగా అనారోగ్యంతో రాయిప్రభాకర్ మృతిచెందగా అతడి కూతురుకు రూ.50వేలను బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. బాధిత కుటుంబాలకు మిత్రులు అండగా నిలవడంపై స్థానికులు అభినందిస్తున్నారు.