పఠాన్కోట్ ఆర్మీ క్యాంప్ వద్ద పేలుడు.. హైఅలర్ట్
ABN , First Publish Date - 2021-11-22T15:01:06+05:30 IST
పఠాన్కోట్లోని ధీర్పుల్ ఏరియా భారత ఆర్మీ క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ..
శ్రీనగర్: పఠాన్కోట్లోని ధీర్పుల్ ఏరియా భారత ఆర్మీ క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్ పేలుడు చోటుచేసుకుంది. త్రివేణి గేటుకు సమపంలో గ్రనేడ్ పేలడంతో అన్ని చెక్ పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. పెళ్లి ఊరేగింపు ఒకటి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం అందలేదు. ఘటనా స్థలి నుంచి గ్రెనేడ్ అవశేషాలను స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఘటనపై తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు పఠాన్కోట్ ఎస్ఎస్పీ సురేంద్ర లంబా తెలిపారు.