వరుడిపై 50 లక్షల పరువు నష్టం దావా వేసిన స్నేహితులు.. కారణం ఏంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-06-28T01:23:16+05:30 IST
ఎవరి సామర్థ్యానికి తగినట్టు వారు తమ పెళ్లి వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు.
ఎవరి సామర్థ్యానికి తగినట్టు వారు తమ పెళ్లి వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అప్పు చేసైనా పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి హల్దీ, బరాత్, మెహందీ.. ఇలా ప్రతీ వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వైభవంగా జరిగే పెళ్లి వేడుకలో అలకలు, బుజ్జగింపులు కూడా సహజం. అయితే తాజాగా ఉత్తరఖండ్లో ఓ పెళ్లిలో వింత ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
కాబోయే అత్త ప్రవర్తన నచ్చలేదట.. ప్రేమించిన వాడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి కథ ఇదీ..!
హరిద్వార్లోని బహదూరాబాద్లో రవి అనే వ్యక్తి తన పెళ్లి వేడుకను వైభవంగా చేసుకుంటున్నాడు. బంధుమిత్రుల కోసం ఒక స్థాయిలో ఏర్పాట్లు చేశాడు. పెళ్లి రోజు బరాత్ వేడుకకు కూడా ఘనంగా ఎరేంజ్మెంట్స్ చేశారు. అయితే, తన స్నేహితులు రాకుండానే రవి బరాత్కు వెళ్లిపోయాడు. దీంతో అతని స్నేహితులు హర్ట్ అయ్యారు.
ఐదుగంటలకు అని చెప్పి.. ఆ సమయం కంటే ముందే వరుడు బరాత్కు వెళ్లిపోయాడని, అతడి స్నేహితులు అలిగారు. తమను పెళ్లికి పిలిచి అవమానపరిచాడని భావించారు. దీంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి.. వరుడు రవిపై యాభై లక్షల రూపాయల పరువు నష్టం దావ వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వింత ఘటన నెట్టింట వైరల్గా మారింది.