పైకి చిమ్ముతున్న భూగర్భజలాలు
ABN , First Publish Date - 2021-11-27T05:43:32+05:30 IST
పట్టణ సమీపంలోని కౌండిన్యనది ఒడ్డున ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం కోసం వేసిన బోరు నుంచి ఫౌంటేన్ను తలపిస్తూ భూగర్బ జలాలు పైకి వెదజల్లుతున్నాయి.
పలమనేరు, నవంబరు26 : పట్టణ సమీపంలోని కౌండిన్యనది ఒడ్డున ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం కోసం వేసిన బోరు నుంచి ఫౌంటేన్ను తలపిస్తూ భూగర్బ జలాలు పైకి వెదజల్లుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు చాలా పైకి వచ్చాయి. కొన్నిచోట్ల వ్యవసాయ బోర్లనుంచి కూడా నీరు వాటంతట అవే వెలుపలికి వస్తున్నాయి. అయితే ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం వద్ద దాదాపు 3 అడుగుల ఎత్తువరకు నీరు పైకి చిమ్ముతోంది.