కేంద్రం నుంచి రూ.8,633 కోట్ల జీఎస్టీ విడుదల

ABN , First Publish Date - 2022-06-02T17:28:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వాటాలో రూ.8,633 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకతో పాటు 21 రాష్ట్రాలకు రూ. 86,912 కోట్లు కేంద్ర

కేంద్రం నుంచి రూ.8,633 కోట్ల జీఎస్టీ విడుదల

బెంగళూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వాటాలో రూ.8,633 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకతో పాటు 21 రాష్ట్రాలకు రూ. 86,912 కోట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. ఇందులో కర్ణాటకకు రావాల్సిన 8,633 కోట్లు ఉన్నాయి. కర్ణాటకకు 2022 మే 31వరకు రూ.8,633 కోట్ల జీఎస్టీ వాటా మంజూరైందని సీఎం బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-06-02T17:28:20+05:30 IST