జీటీ దేవెగౌడ నివాసానికి కటీలు, మంత్రి సోమశేఖర్
ABN , First Publish Date - 2022-05-20T17:17:44+05:30 IST
జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీటీ దేవెగౌడను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీలు, మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్టీ సోమశేఖర్ పరామర్శించారు.
బెంగళూరు: జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీటీ దేవెగౌడను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్కుమార్ కటీలు, మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎస్టీ సోమశేఖర్ పరామర్శించారు. గురువారం ఇద్దరు కీలక నేతలు మైసూరులోని జీటీ దేవెగౌడ నివాసానికి వెళ్లారు. మూడురోజుల కిందట ఆయన మనవరాలు మృతి చెందడంతో కుటుంబీకులను పరామర్శించారు. ఎంపీ ప్రతాప్ సింహా, ఎమ్మెల్యేలు నిరంజన్, మహేష్, మాజీ మంత్రి విజయశంకర్, ముడా అధ్యక్షుడు రాజీవ్ సహా పలువురు నేతలు ఉన్నారు. జీటీ దేవెగౌడ జేడీఎస్ కు దూరంగా ఉంటున్నారు. అయినా మనవరాలి మృతితో బాధలో ఉండే జీటీ దేవెగౌడను మాజీ సీఎం కుమారస్వామి పరామర్శించారు. తాజాగా బీజేపీకి చెందిన నేతలు పరామర్శించారు.