గుబ్బల మంగమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-03-01T05:11:33+05:30 IST

గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది.

గుబ్బల మంగమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
అమ్మవారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు

 భారీ అన్నసమారాధన

బుట్టాయగూడెం, ఫిబ్రవరి 28 : గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు దినం కావడంతో పాటు పవిత్ర జాతర ఉత్సవాలు ముగింపు రోజు పుర స్కరించుకుని భక్తులు తరలివ చ్చారు. గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉంటూ దర్శనం చేసుకున్నారు. శనివారంతో జాతర ఉత్స వాలు ముగియడంతో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు, సీఐ మూర్తి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో దారులన్నీ భక్తులతో నిండిపోవడంతో చిన్నపిల్లలతో వచ్చిన వారు ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరావు సిబ్బందితో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను బయటకు పంపించారు. 

Updated Date - 2021-03-01T05:11:33+05:30 IST