దళితుల భూ సమస్య పరిష్కారంలో అన్యాయం

ABN , First Publish Date - 2020-07-06T09:42:20+05:30 IST

గుడివాడ నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన భూ సమస్య పరిష్కారంలో వైసీపీ ..

దళితుల భూ సమస్య పరిష్కారంలో అన్యాయం

గుడివాడ టౌన్‌, జూలై 5 : గుడివాడ నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన భూ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని సీపీఎం తూర్పు కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారం చేపడితే ఇలపర్రు దళితులకు వారి భూములు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని ఇప్పిస్తానని మంత్రి కొడాలి నాని ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. అంకన్నగూడెంలో అన్యాక్రాంతంగా తవ్విన చేపల చెరువులు, అసైన్డ్‌ భూములు, ఇలపర్రు భూములు స్వాధీనం చేసుకుని దళితులకు పంచకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-07-06T09:42:20+05:30 IST